Don't Miss!
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సింగర్స్ గా మారబోతున్న మంచు విష్ణు డాటర్స్.. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా..
మంచు విష్ణు త్వరలోనే గాలి నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొంతకాలంగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్న విష్ణు ఈసారి తన సరికొత్త కామెడీ టైమింగ్ తో అలరించడానికి సిద్దం అయ్యాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే గ్లామరస్ మాజీ శృంగారతార సన్నీ లియోన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సన్నీలియోన్ తో కలిసి ఇటీవల మంచు విష్ణు చేసిన కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని మంచు విష్ణు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేసే మంచు విష్ణు ఈసారి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక పాటను పాడించబొతున్నట్లు సమాచారం. మంచు విష్ణు ట్విన్స్ దాటర్స్ అరియానా - వివియానా ఇద్దరు కూడా గాలి నాగేశ్వరరావు సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటతో అలరించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనే వారి పాట హైలెట్ గా నిలుస్తుందట. ఇప్పటికే కంపోజింగ్ పూర్తి చేసిన అనూప్ రూబెన్స్ త్వరలోనే పాటను కూడా విడుదల చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భాస్కర బట్ల పాటను రాసారు. ఇక ఈ సినిమాతో మంచు విష్ణు తన ఇద్దరు కుమార్తెలను కూడా ఇండస్ట్రీకి మొదట సింగర్ గా పరిచయం చేస్తుండడం విశేషం. అయితే ఈ సాంగ్ ను ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.
తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని మంచి విష్ణు బాగానే కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో కీలకమైన అప్డేట్ ను త్వరలోనే అంధించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు కథ మాటలు ప్రముఖ సీనియర్ రైటర్ కోన వెంకట్ అందించగా జి.నాగేశ్వరరెడ్డి సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మంచు విష్ణు త్వరలోనే శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో కొత్త సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. డి సినిమా సీక్వెల్ గా గా రాబోయే ఆ సినిమాకు ఢీ అండ్ ఢీ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఆ సినిమా కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతే కాకుండా మంచి విష్ణు మరో రెండు సినిమాల కథల విషయంలో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.