Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మారుతి దర్శత్వంలో మెగా హీరో!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. దీనితో తేజు చిత్రలహరిపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తుండడం విశేషం. తేజు సరసన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించబోతునట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మే నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శైలజారెడ్డి అల్లుడు చిత్రం తర్వాత మారుతి ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. కొంత మంది యువ హీరోలతో సినిమా ఉండబోతోందని ప్రచారం జరిగినా ఆ వార్తలని మారుతి ఖండించాడు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది.