Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మెగా క్రిస్టమస్ పార్టీ.. మెగా యువ హీరోలందరు ఒకే ఫ్రేమ్ లో.. మిస్సయ్యింది అతనొక్కడే!
మెగా ఫ్యామిలీలో హీరోలు బయట ఎంత స్టార్ డమ్ తో ఉన్నప్పటికీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. కుల మతాలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని రకాల పండగలను కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఇటీవల క్రిస్మస్ వేడుకలను కూడా మెగా హీరోలు అందరూ కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా హీరోలు అందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫోటో ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అయితే అందులో మరొకరు ఉండి ఉంటే చాలా బాగుండేది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
వారికంటూ ఒక గుర్తింపు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత వచ్చిన వారందరూ కూడా వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వరకు సొంతంగా జనాల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకే ఫ్రేమ్ లో మెగా కజిన్స్
ఈసారి కూడా రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ ఇలా అందరూ కలిసి ప్రత్యేకమైన పండగలను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా క్రిస్టమస్ వేడుకలను మెగా హీరోలు అందరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారు. చాలా మంది మెగా అభిమానులు చూడటానికి ఇష్టపడే ఒక అందమైన చిత్రం ఏమిటంటే, మెగా కజిన్స్ అందరూ సందర్భానుసారంగా ఏకమవుతున్నారు.
మెగా హీరోలు..
ఇక పండగలకి ఎలాగోలా మెగా హీరోలు, మెగా కజిన్స్ ఎక్కడో ఒకచోట కలుసుకుని కలిసి ఫోటో దిగేలా చూసుకుంటున్నారు. ఇక క్రిస్మస్ పార్టీ రోజు కూడా మరోసారి అందరూ ఏకమయ్యారు. అల్లు అర్జున్ రామ్ చరణ్ కలిసి పోజులివ్వగా వారితో వరుణ్ తేజ్ సాయిధరమ్, వైష్ణవ్ సహా దాదాపు అందరు మెగా హీరోలు తమ ఇతర కజిన్స్, నిహారిక, సుస్మిత మరియు శ్రీజ మరియు ఇతరులతో కలిశారు.
అకిరా కూడా ఉండాల్సింది..
అయితే పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా ఈ ఫ్రేమ్ లో ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అకిరా నందన్ మిస్ అయ్యాడు అని అంటున్నారు. మెగా కజిన్స్ తో చాలా వరకు అకిరా క్లోజ్ గానే ఉంటాడు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో చాలా ఫ్రెండ్లిగా ఉంటాడని అర్ధమయ్యింది. ఇక ఇలాంటి ఫెస్టివల్స్ లో అతను ఉండి ఉంటే ఫ్రేమ్ మరోలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్రమశిక్షణతో..
ఇక ఈ ఫొటోలో శ్రీజ భర్త కళ్యాణదేవ్ మరియు అల్లు శిరీష్ కూడా లేరు. గతంలో మెగా కజిన్స్ దీపావళి పండగలో ఇదే విధంగా కలిసి పోజులిచ్చారు. కుటుంబ సభ్యులు ఐకమత్యంతో ఎలా నిలబడాలి అనేదానికి ఇదొక ఉదాహరణ అని అంటున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అంకితభావం, క్రమశిక్షణ మరియు సంకల్పబలం ఉంటే ఒకే రంగంలో అయినా విజయం సాధించగలరని మెగా హీరోలు నిరూపించారు.