Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. మరో హీరోకి కరోనా పాజిటివ్.. హాస్పిటల్ లో చేరిక !
మెగా ఫ్యామిలీలో మరోసారి కరోనా కలకలం రేగింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సహా రామ్ చరణ్, వరుణ్ తేజ్ లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వారంతా కరోనా నుండి కోలుకున్నారు కూడా. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా సోకగా చికిత్స తీసుకున్నాక నెగిటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్ కి కూడా కరోనా సోకింది. తనకు కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో బుధవారం నాడు టెస్ట్ చేయించుకున్నాను అని ఆ టెస్ట్ రిజల్ట్స్ ఈ రోజు వచ్చాయని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అందులో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నాడు.
అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్న కళ్యాణ్ త్వరలోనే మరింత స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా తిరిగి వస్తానని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి హాస్పిటల్ లో క్వారెంటైన్ లో ఉన్నానని మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను కళ్యాణ్ దేవ్ వివాహమాడిన సంగతి తెలిసిందే. శ్రీజ మొదటి భర్త భరద్వాజ్ తో విడిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. అనంతరం కళ్యాణ్ దేవ్ విజేత అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం కళ్యాణ్ సూపర్ మచ్చి అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇది కాకుండా రామ్ తాళ్లూరి ప్రొడక్షన్ లో కూడా ఈయన మరో సినిమా చేస్తున్నాడు. ఇక ఇది కాక గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేకం ఆర్ట్స్ సంయుక్తంగా మరో సినిమాను కళ్యాణ్ హీరోగా నిర్మిస్తున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక కరోనా కారణంగా చిరంజీవి అభిమానులలో కొందరు ముఖ్యులు కూడా ఈ మధ్య కాలంలో కాలం చేశారు. దీంతో చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.