Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే.. తమ్ముడి కోసం మరో కథ సెట్ చేసిన మెగా హీరో
మెగా ఫ్యామిలి నుంచి త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న యువ నటుడు వైష్ణవ్ తేజ్. సుకుమార్ ప్రొడక్షన్ లో రూపొందిన ఉప్పెన అనే ఆ సినిమా మొన్న సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని విధంగా లాక్ డౌన్ దెబ్బకు ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు.
అయితే మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ కోసం మరికొన్ని ప్రాజెక్టులు సెట్టయినట్లు తెలుస్తోంది. ముందుగా అన్నయ్య సాయి ధరమ్ తేజ్ మరొక ప్రేమ కథను వైష్ణవ్ తేజ్ కోసం సెట్ చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కంటే ముందు నుంచే ఆ కథపై చర్చలు జరుపుతున్నారట. కానీ మొదటి సినిమా రిలీజ్ కాకముందే హడావుడిగా రెండో సినిమాతో అప్పుడే హడావుడి చేయడం కరెక్ట్ కాదని పెండింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
కొత్త దర్శకుడు చెప్పిన ఆ కథ అయితే ముందుగా సాయి ధరమ్ తేజ్ చేయాలని అనుకున్నాడట. కానీ కథ తమ్ముడికి అయితేనే కరెక్ట్ గా సెట్టవుతుందని ఆ తరువాత దర్శకుడి మనసు మర్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఉప్పెన సినిమా కొత్త రిలీజ్ డేట్ పై వచ్చే నెలలో క్లారిటీ ఇవ్వాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.