కొరటాల చేతుల మీదుగా మెగా హీరో కొత్త చిత్రం ప్రారంభం!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రాంభమైంది. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ నిరాశలో ఉన్నాడు. నిరాశ నుంచి తేరుకుని కొత్త ఉత్సాహంతో మరో చిత్రాన్ని ప్రారంభించాడు. సుప్రీం తరువాత తేజుకి ఒక్క విజయం కూడా దక్కలేదు. తేజు చివరగా నటించిన చిత్రం తేజ్ ఐ లవ్ యూ. ఈ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకున్న సాయిధరమ్ తేజ్ తన మేకోవర్ ని మార్చుకున్నాడు.
నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శత్వంలో తేజు నటించబోతున్న చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ అతిధిగా విచ్చేసి చిత్రాన్ని లాంచ్ చేశారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కి కూడా ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రలహరి అనేది ఈ చిత్రానికి టైటిల్.


భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో తేజు సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











