Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
విడుదలకు ముందే రికార్డులపై పంజా.. మెగా మేనల్లుడు క్లిక్కయ్యేలా ఉన్నాడు!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నేటితరం హీరోలు ఎవరికి వారు ప్రత్యేకంగా ఒక క్రేజ్ అందుకున్నారు. అలాగే వారికంటూ ఒక మార్కెట్ ని కూడా సెట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ మరో మెగా హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.
ఫస్ట్ లుక్ నుంచి ఫస్ట్ సాంగ్ వరకు పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ సలహా మేరకు పంజా ట్యాగ్ సెట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్ అప్పుడే రికార్డులపై పంజా విసురుతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మొదటి లవ్ సాంగ్ 'నీ కన్ను నీలి సముద్రం' యూ ట్యూబ్ లో బాగానే క్లిక్కయింది. 50మిలియన్స్ వ్యూవ్స్ తో ఆ సాంగ్ హీరో కెరీర్ కి మంచి ఎనర్జీని ఇచ్చింది. ఇంకా సినిమా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే మెగా హీరో ఈ విదంగా సక్సెస్ అందుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
సుకుమార్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఉప్పెన సినిమాకు ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా మరో డేట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి శెట్టి నటించింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు ఫినిష్ అయ్యాయి. వచ్చే నెలలో కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ చర్చలు జరుపుతోంది.