Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విడుదలకు ముందే రికార్డులపై పంజా.. మెగా మేనల్లుడు క్లిక్కయ్యేలా ఉన్నాడు!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నేటితరం హీరోలు ఎవరికి వారు ప్రత్యేకంగా ఒక క్రేజ్ అందుకున్నారు. అలాగే వారికంటూ ఒక మార్కెట్ ని కూడా సెట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ మరో మెగా హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.
ఫస్ట్ లుక్ నుంచి ఫస్ట్ సాంగ్ వరకు పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ సలహా మేరకు పంజా ట్యాగ్ సెట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్ అప్పుడే రికార్డులపై పంజా విసురుతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మొదటి లవ్ సాంగ్ 'నీ కన్ను నీలి సముద్రం' యూ ట్యూబ్ లో బాగానే క్లిక్కయింది. 50మిలియన్స్ వ్యూవ్స్ తో ఆ సాంగ్ హీరో కెరీర్ కి మంచి ఎనర్జీని ఇచ్చింది. ఇంకా సినిమా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే మెగా హీరో ఈ విదంగా సక్సెస్ అందుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
సుకుమార్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఉప్పెన సినిమాకు ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా మరో డేట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి శెట్టి నటించింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు ఫినిష్ అయ్యాయి. వచ్చే నెలలో కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ చర్చలు జరుపుతోంది.