Don't Miss!
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో సినిమాలో మెగాస్టార్ గెస్ట్ రోల్.. ఆ హీరోలు కలిసింది అందుకేనా?
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బిగ్ బాస్ ఫైనల్ రోజున సోహెల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తప్పకుండా నీ సినిమాలో అవకాశం ఉంటే చెప్పు ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తానని అన్నాడు. అయితే ఆ విషయం మరువక ముందే మరొక సినిమాలో కూడా మెగాస్టార్ ఒక గెస్ట్ పాత్రలో నటించే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఒక సీనియర్ నటుడు ప్రత్యేకంగా కలుసుకోవడం కూడా ఆ రూమర్స్ కు మరింత బలాన్ని ఇచ్చాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల మోహన్ బాబును కలుసుకున్న విషయం తెలిసిందే. ఎందుకు కలుసుకున్నారనే విషయం బయటకు రాలేదు. అలాగే అంతకు ముందే మంచు విష్ణు కూడా కలుసుకున్నారు. అయితే ఈ స్పెషల్ మీటింగ్స్ జరిగింది ఆయనను అతిధి పాత్రలో ఒప్పించాడనికేనని రూమర్స్ వస్తున్నాయి.
ఇక మెగాస్టార్ కూడా ఒప్పుకున్నారా లేదా అనే విషయంలో అయితే ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమా విషయంలోకి వెళితే.. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు హోమ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాకు రైటర్ రత్నబాబు దర్శకుడు.
సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్స్ జరుగుతున్నాయి. అందుకే ఒక ముఖ్యమైన పాత్రలో మెగాస్టార్ చిరంజీవిని నటించమని అడిగినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.