Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బోనాలపండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్.. అందరూ సంతోషంగా ఉండాలని..
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే కరోనా కష్టకాలంలో చాలామందికి సహాయం కూడా చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్స్ ను ఉచితంగా అంధించారు. ఇక ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా కూడా మెగాస్టార్ స్పెషల్ విషెస్ అందిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ హడావుడి మొదలయ్యింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రజలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. 'బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఇక నెక్స్ట్ మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలోకి వచ్చేసింది. త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇక త్వరలోనే మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదళం సినిమాను కూడా ఇదే ఏడాది పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.