Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మిలింద్ సోమన్ మళ్లీ అర్ధనగ్నంగా.. పాతికేళ్ల డార్లింగ్తో రొమాన్స్ జోరు.. గోవాలో కేసు పెట్టినా..
బాలీవుడ్ నటుడు, టాప్ మోడల్ మిలింద్ సోమన్ తన 55వ బర్త్ డే రోజ వేడుకను పాతికేళ్ల భార్యతో కలిసి గోవాలో జరుపుకొన్నారు. బర్త్ డే జోష్లో గోవా బీచ్లో నగ్నంగా పరిగెత్తడం వివాదంగా మారింది. ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది వైరల్గా మారడంతో గోవా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో గోవాలో ఆయన తన భార్యతో మరింత రొమాంటిక్గా వ్యవహరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మిలింద్, ఆయన భార్య అంకితా కొన్వర్ హాట్ ఫోటోలు మీకోసం..
బర్త్ డే రోజున నగ్నంగా
తన బర్త్డే రోజున నగ్నంగా బీచ్లో పెరుగెత్తడం మిలింద్ సోమన్ను ఇబ్బందుల్లో పడేసింది. నెటిజన్లలో ఓ వర్గం ఆయన తీరును తప్పుబడితే గోవా పోలీసులు కేసు నమోదు చేసి షాకిచ్చారు. ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం, అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్లతో ఆయనపై కేసు నమోదు చేయడం మరో వివాదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన రొమాన్స్ను ఆపినట్టు కనిపించడం లేదు.
గోవా బీచ్లో సూర్యాస్తమయాన్ని
గోవా బీచ్లో తన భార్యతో కలిసి అర్ధనగ్నంగా సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ కనిపించాడు. సముద్ర తీరంలో మిలింద్ తన భార్యతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన 55వ జన్మదిన వేడుకలను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు కనిపించింది.
ఆయనకు 57 ఏడు.. ఆమెకు 27
57 ఏళ్ల మిలింద్ మరో ఫోటోలో పాతికేళ్ల తన భార్య అంకితాను కౌగిలించుకొన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిలింద్ రన్నింగ్ అనే అకౌంట్లో తనలోనే భావుకతను బయటపెట్టారు. సూర్యాస్తమయం ఎక్కడైనా చాలా అందంగా ఉంటుంది. మానవుడు తన మైండ్ సెట్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
పూనమ్ పాండే, మిలింద్పై కేసు
ఇదిలా ఉండగా, గోవాలో సినీ ప్రముఖులపై గతవారం రెండు కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజుల క్రితం గోవా బీచ్లో శృంగారం ఒలకబోసిందుకు పూనమ్ పాండేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాంతో ఆమె కనకోనా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయమూర్తి మంజూరు చేశారు. గోవా బీచ్లో అసభ్యకరమైన వీడియో షూట్ చేశారనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇలాంటి పరిస్తితుల్లో మిలింద్ రొమాన్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
బాలీవుడ్లో మిలింద్ కెరీర్
మిలింద్ సోమన్ పలు టెలివిజన్ షోలు, మోడలింగ్ ప్రాజెక్టులు, సినిమాలతో బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆయన నటించిన ఫోర్ మోర్ షాట్స్ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో ప్రసారమైంది. ఈ వెబ్ సిరీస్లో సయానీ గుప్తాతో కలిసి నటించారు. త్వరలోనే కెప్టెన్ వ్యోమ్ అనే టెలివిజన్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.