ఫ్యాన్సీ రేటుకు అఖిల్ మిస్టర్ మజ్ను శాటిలైట్ హక్కులు!
అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. అఖిల్ సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ కూడా ఆకట్టుకుంది. హిట్ దర్శకుడు, కొత్తగా అఖిల్ పాత్ర ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మిస్టర్ మజ్ను శాటిలైట్ హక్కుల గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర శాటిలైట్ హక్కులని ఓ ప్రముఖ సంస్థ 5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించిన బివిఎస్ఎన్ ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి ప్రేమ చిత్రానికి అదిరిపోయే సాంగ్స్ అందించాడు. మళ్ళి అదే కాంబినేషన్ కావడంతో ఆసక్తి నెలకొంది.

ఇక అఖిల్ ఈ చిత్రపై పూర్తి జాగ్రత్త వహిస్తున్నాడు. తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో మిస్టర్ మజ్నులో తన నటన, లుక్స్ పై అఖిల్ కేర్ తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది.


Click it and Unblock the Notifications











