Don't Miss!
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నాగ చైతన్య కోసం నదిలో దూకిన అభిమాని: షూటింగ్ క్యాన్సిల్.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే!
అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. 'జోష్' అనే మూవీతో తెరంగేట్రం చేసిన అతడు.. ఆ వెంటనే 'ఏమాయ చేశావే' అనే మూవీతో మొదటి హిట్ను అందుకున్నాడు. అనంతరం కూడా పలు విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్గా ఎదిగిపోయాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ప్రేమను అందుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాగ చైతన్య కోసం ఓ అభిమాని నదిలో దూకేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!
అలా మొదలైన నాగ చైతన్య ప్రయాణం
చెన్నైలో పుట్టి పెరిగిన నాగ చైతన్య గ్రాడ్యువేషన్ను మాత్రం హైదరాబాద్లో పూర్తి చేశాడు. ఆ సమయంలోనే తండ్రి నాగార్జునతో తన కెరీర్ గురించి మాట్లాడాడు. ఆ సందర్భంలో తనకు హీరో అవ్వాలనుందని మనసులోని మాటను బయట పెట్టాడు. అందుకు అనుగుణంగానే చాలా కాలం పాటు నటన, డైలాగ్స్, ఫైట్స్ తదితర విభాగాల్లో శిక్షణ ఇప్పించి సినిమాల్లోకి తీసుకొచ్చారు.
వరుస విజయాలతో ఫుల్ జోష్లో హీరో
2009లో వచ్చిన 'జోష్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఆ తర్వాత సుదీర్ఘమైన కెరీర్లో 17 సినిమాల్లో నటించాడు. వీటిలో 'ఏమాయ చేశావే', '100% లవ్', 'మనం', 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'మజిలీ', 'వెంకీమామ' వంటి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మిగతావి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అలాగే కొన్నింటిలో అతిథి పాత్రల్లో కనిపించాడు.
లవ్ స్టోరీతో రెడీగా ఉన్న యువ సామ్రాట్
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది.
మరోసారి ఆ దర్శకుడితో.. థ్యాంక్యూ అని
'మనం' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నాగ చైతన్య - విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'థ్యాంక్యూ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
|
చైతన్య కోసం నదిలో దూకిన అభిమాని
'థ్యాంక్యూ' మూవీ షూటింగ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల్లోని కెనాల్లో జరుగుతోంది. దీంతో తమ అభిమాన హీరోను చూసేందుకు నాగ చైతన్య అభిమానులు వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని వంతెనపై నుంచి చైతన్యను చూస్తూ చూస్తూ ఒక్కసారిగా నీటిలోకి దూకేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
షూటింగ్ క్యాన్సిల్.. చివరికలా సాధించాడు
పడవలో వెళ్తోన్న నాగ చైతన్య కోసం అభిమాని నీటిలో దూకేయడంతో.. షూటింగ్ను ఈరోజుకు క్యాన్సిల్ చేసింది చిత్ర యూనిట్. ఆ తర్వాత సదరు కుర్రాడిని కూడా బోటు ద్వారా ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం అతడితో ఫోటో దిగిన చైతూ.. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని సున్నితంగా హెచ్చరించాడు. గతంలో ఓ ఫ్యాన్ చైతూ కోసం మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కాడు.