Don't Miss!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- News టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
దిల్ రాజు విషయంలో నాగ చైతన్య ఎందుకిలా చేశాడు.?
అక్కినేని నాగ చైతన్య.. నాగార్జున కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో కొన్ని హిట్స్ వచ్చినా.. ఆ తర్వాత చాలా వరకు ఫ్లాప్లు పలకరించాయి. దీంతో కొద్దిరోజులుగా సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య సమంతతో కలిసి నటించిన 'మజిలీ' ద్వారా చైతూ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి ఇకపై చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ అక్కినేని హీరో భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
'మజిలీ' గ్రాండ్ సక్సెస్ అవడంతో నాగ చైతన్య రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్తో కలిసి 'వెంకీ మామ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకీ సరసన పాయల్, చైతూకు జంటగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల మూవీని ఓకే చేసేశాడు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ ఫిల్మ్స్స్ వాళ్లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోగా నాగ చైతన్యకు ఇది 20వ సినిమా.
దీనితోపాటు, మరికొన్ని సినిమాలను కూడా పట్టాలెక్కించాలన్న క్రమంలో కథలను వింటున్నాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చైతూ దగ్గరకు శశి అనే కొత్త దర్శకుడిని పంపించాడని గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడు కథలో కొన్ని మార్పులు చేయమన్న చైతూ.. మరో కథతో వెళ్తే రిజక్ట్ చేశాడని అంటున్నారు. మంచి ఫ్యామిలీ స్టోరీని తీసుకెళ్లినప్పటికీ చైతూ రిజక్ట్ చేయడంతో ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది.