Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విడాకుల తరువాత మొట్టమొదటిసారి లైవ్ లోకి రానున్న చైతూ.. తమ్ముడి కోసం రిస్క్ చేసి మరీ!
అక్కినేని నాగచైతన్య సమంతతో విడిపోతున్నట్లు గత కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సమంత నాగచైతన్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. విడాకులు ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా తాను ఇబ్బందులు పడుతున్నట్లుగా కొన్ని పోస్టులు షేర్ చేస్తూ ఉండగా నాగచైతన్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే నాగచైతన్య ఎప్పుడు తమ్ముడు అఖిల్ కోసం ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళబోతున్నారు ఆ వివరాల్లోకి వెళితే
సిసింద్రీ అనిపించుకుని
అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటికే దాదాపు మూడు సినిమాలు చేశారు. ముందు సిసింద్రీ తర్వాత అఖిల్ మనం అనే సినిమాలో ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో పాటు నాగ చైతన్య, నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాలో అఖిల్ కూడా క్లైమాక్స్ లో ఒక చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. వి వి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.
అఖిల్ మొదలు
ఆ సినిమా కలిసి రాకపోవడంతో ఆయన ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మరీ హలో అనే సినిమా చేశారు. అప్పటివరకు మంచి హిట్స్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఆ సినిమా కూడా హిట్ దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా తరువాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ హలో సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఆయన మళ్లీ మరొక సంవత్సరం గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశారు.అయితే ఈ సినిమా కూడా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
ఇక ఈ దెబ్బతో అఖిల్ సినిమాల ఎంపిక మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నారు. అలా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు దసరా కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా ఆ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అనుకునేసరికి మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ చేశారు. డేట్ కన్ఫర్మ్ చేయడమే కాక ఈవెంట్ కి ముఖ్య అతిథి ఎవరు అనేది కూడా ప్రకటించారు.
Recommended Video
తమ్ముడి కోసం అన్న
అక్టోబర్ 8న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిక్స్ చెయ్యగా దానిని హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నారు. దీనికి అఖిల్ సోదరుడు అక్కినేని నాగచైతన్య స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్టు సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
కొన్నాళ్ల పాటు ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డ చైతూ తన లవ్ స్టోరీ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 15 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా కమిట్ అయ్యాడు.