Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శౌర్య నెక్స్ట్ సినిమాలో అల్లరి ఎక్కువేనట...!
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల అశ్వథామ సినిమాతో రైటర్ గానూ సత్తా చాటుకున్న ఈ టాలెంటెడ్ హీరో లాక్ డౌన్ ను ఎంత పర్ఫెక్ట్ గా వాడుకున్నాడో అందరికీ తెలసిందే. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు శౌర్య.
ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టైనర్ పతాకం పై లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇదిలా ఉంటే మరో ఇంట్రస్టింగ్ అనౌన్స్ మెంట్ చేసాడు శౌర్య. 'అలా ఎలా' 'లవర్' చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణతో సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం శౌర్య నటిస్తున్న చిత్రాలకు పూర్తి భిన్నంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది.
ఇది నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్ లో శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి ఉషా మల్పూరి నిర్మించనున్నారు. బుజ్జి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
నాగ శౌర్య 'ఛలో' సినిమాకు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. మరి త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ సినిమాతో శౌర్య సొంత బ్యానర్ లో మరో హిట్ కొట్టేట్టుగానే కనిపిస్తున్నాడు.