Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వరుడు కావలెను అంటూ.. మరో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్న నాగశౌర్య
ప్రస్తుతం లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ గా గుర్తింపు అందుకుంటున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ కేవలం పెద్ద హీరోలతోనే కాకుండా టాలెంట్ ఉన్న చిన్న హీరోలతో కూడా మినీ బడ్జెట్ లో సినిమాలను నిర్మిస్తోంది. ఇక ఈ బ్యానర్ లో యువ కథానాయకుడు నాగ శౌర్య కూడా నటిస్తున్నాడు. కథానాయిక 'రీతువర్మ' నటిస్తుండగా 'లక్ష్మీ సౌజన్య' ను దర్శకురాలిగా పరిచయం కానుంది.
ఇక సినిమా పై గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్ కు చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పెట్టింది. 'వరుడు కావలెను' అనే టైటిల్ సెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టైటిల్ విషయంలో మళ్ళీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు రూమర్స్ రాగా ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ను కూడా బాగా ఎట్రాక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత హైప్ క్రియేట్ చేసింది. నెటిజన్స్ నుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సినిమా కథకు తగ్గట్లుగానే 'వరుడు కావలెను' అనేపేరును ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక నాగశౌర్య, రీతువర్మతో పాటు నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్