Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఆ బయోపిక్ ఎందుకు చేయలేదంటే.. నాగార్జున వివరణ
టాలీవుడ్లో బయోపిక్ల ట్రెండ్ కొనసాగుతున్నది. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, పుల్లెల గోపిచంద్ బయోపిక్ లాంటివి తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో నా వద్దకు ఓ బయోపిక్ ఆఫర్ వచ్చిందని అక్కినేని నాగార్జున తెలిపారు. అయితే మా నాన్న అక్కినేని నాగేశ్వరరావుది కాదు అని స్పష్టం చేశారు.
వీపీ మీనన్ (వప్పాల ఫంగున్ని మీనన్) జీవితం ఆధారంగా తెరకెక్కించాలని కొందరు ప్రయత్నం చేశారు. ఆయన పాత్రలో నన్ను నటించమని అడిగారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో నేను చేయలేకపోయాను. ప్రస్తుతం అదే కథ నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్గా వస్తున్నది అని నాగార్జున తెలిపారు.
దేశానికి స్వాత్రంత్యం వచ్చిన తర్వాత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కార్యదర్శి వీపీ మీనన్ వ్యవహరించారు. సంస్థానాల విలీనంలో కీలక పాత్ర వహించారు. కొందరు రాజులు విలీనాలకు ఒప్పుకోకపోవడంతో వారు చేసిన అన్యాయాలను, అక్రమాలను చిట్టారూపంలో వారికి చూపించి.. వారిని బలవంతంగా విలీనానికి ఒప్పించారు.
సంస్థానాల విలీనంలో వీపీ మీనన్ది హీరోయిజంతో కూడిన పాత్ర. నాకు చాలా నచ్చింది. ఎందుకో చేయడానికి వీలుపడలేదు అని నాగార్జున వెల్లడించారు. నాగార్జున, నాని నటించిన దేవదాస్ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఫిల్మీబీట్తో ముచ్చటిస్తూ ఈ విషయాలను వెల్లడించారు.