Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Sarkaru Vaari Paata స్పెషల్ షోను వీక్షించిన టాలీవుడ్ స్టార్ హీరో.. మహేష్ కోసమే ఇలా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత మళ్లీ మరొక పెద్ద సినిమా తో ఒక సరికొత్త సందడి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ఇష్టపడి చేసిన సర్కారు వారి పాటలు సినిమా నేడు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షో చూడాలని అభిమాన ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా కొంత మంది సినీ తారలు కూడా సర్కారు వారి పాటను ప్రత్యేకంగా వీక్షించాలని చూస్తున్నారు.
ఇక మరి కొందరు అయితే మొదటి రోజు ప్రత్యేకంగా షోలు వేయించుకుని మరి చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొంత మంది సెలబ్రిటీలు అంతా ఒకే థియేటర్లో సినిమాను ప్రత్యేకంగా వేయించుకొని మరీ చూస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై కూడా బాలకృష్ణ మొదటి నుంచి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
మహేష్ బాబు బాలకృష్ణ మంచి సాన్నిహిత్యంతో ఉంటారు అని గతంలో లో అన్ స్థాపబుల్ షో ద్వారా క్లారిటీ వచ్చేసింది. అందులో మహేష్ బాబు బాలయ్య బాబు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అంతే కాకుండా మహేష్ బాబు చేసిన మంచి పనుల గురించి బాలకృష్ణ ప్రశంసలు కురిపించడం విశేషం. ఇక బాలకృష్ణ సర్కారు వారి పాట సినిమాను కూడా వీక్షించాలి అని చాల రోజులుగా ఎదురుచూస్తున్నారట. సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక నిర్మాతలు బాలయ్యబాబు కోసం ప్రత్యేకంగా సర్కారు వారు పాట షో కూడా వేయడం జరిగిందట. ఈ ప్రత్యేకమైన షో కోసం టాలీవుడ్ లోని ప్రముఖ సెలబ్రిటీలు అంతా పాల్గొన్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా సర్కారు వారి పాట సినిమాను వీక్షించడం జరిగింది.
సాధారణంగా బాలకృష్ణకు ఏ హీరో కనెక్ట్ అయినా కూడా రెగ్యులర్ గా వారి సినిమాలు చూస్తూనే ఉంటారు. ఇక మహేష్ బాబు కూడా గత కొంతకాలంగా సన్నిహితంగా ఉండటంతో ఆయన ప్రతి సినిమాను కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సర్కారు వారి పాట సినిమా బాలయ్య బాబుకు చాలా బాగా నచ్చేసినట్లుగా తెలుస్తోంది. దర్శక నిర్మాతలపై కూడా ఆయన ప్రశంసలు కురిపించినట్లు సమాచారం.
Recommended Video
ఇక సర్కారు వారి పాట సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్ వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమాను కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ సినిమా జూన్ లేదా జులై నెలల్లో మొదలుపెట్టి ఏడాది చివరి లోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక రాజమౌళి ప్రాజెక్టును వచ్చే ఏడాది ఆరంభంలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.