Don't Miss!
- News గేదెల మందులమ్మేవాళ్లు వైసీపీకి సర్వే చేశారంట?
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నందమూరి కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం: ఊహించని పాత్రలు చేయనున్న స్టార్
నందమూరి కుటుంబం నుంచి పలువురు వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ఒకడు. 'తొలి చూపులోనే' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. 'అతనొక్కడే'తో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా సరైన హిట్ను మాత్రం అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే 'పటాస్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన ఈ నందమూరి హీరో.. అప్పటి నుంచి వైవిధ్యమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ కొత్త సినిమాను మొదలు పెట్టాడు.
రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో నందమూరి కల్యాణ్ రామ్ ఓ సినిమాను చేయనున్నాడు. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగాయి. ప్రొడక్షన్ నెంబర్ 14గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్తో పాటు 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా హాజరయ్యాడు. ఇక, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
వాలంటైన్ రోజున ప్రియుడితో పెర్లీ ఫుల్ రొమాన్స్.. తన్మయత్వంలో మునిగిన ప్రేమ జంట
ఇక, కొద్ది రోజులుగా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోన్న కల్యాన్ రామ్.. ఈ సినిమాలో మూడు పాత్రల్లో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే, ఇది పిరియాడిక్ జోనర్లో రూపొందనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, టైమ్ మెషీన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో తమ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.