Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నందమూరి కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం: ఊహించని పాత్రలు చేయనున్న స్టార్
నందమూరి కుటుంబం నుంచి పలువురు వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ఒకడు. 'తొలి చూపులోనే' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. 'అతనొక్కడే'తో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా సరైన హిట్ను మాత్రం అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే 'పటాస్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన ఈ నందమూరి హీరో.. అప్పటి నుంచి వైవిధ్యమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ కొత్త సినిమాను మొదలు పెట్టాడు.
రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో నందమూరి కల్యాణ్ రామ్ ఓ సినిమాను చేయనున్నాడు. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగాయి. ప్రొడక్షన్ నెంబర్ 14గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్తో పాటు 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా హాజరయ్యాడు. ఇక, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
వాలంటైన్ రోజున ప్రియుడితో పెర్లీ ఫుల్ రొమాన్స్.. తన్మయత్వంలో మునిగిన ప్రేమ జంట
ఇక, కొద్ది రోజులుగా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోన్న కల్యాన్ రామ్.. ఈ సినిమాలో మూడు పాత్రల్లో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే, ఇది పిరియాడిక్ జోనర్లో రూపొందనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, టైమ్ మెషీన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో తమ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.