Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం: బడా నిర్మాణ సంస్థతో నందమూరి హీరో బిగ్ మూవీ
బడా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించాడు నందమూరి కల్యాణ్ రామ్. 'తొలి చూపులోనే' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. 'అతనొక్కడే'తో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా సరైన హిట్ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయితే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'పటాస్'తో కెరీర్లోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ నుంచి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ప్రయోగానికి రెడీ అయ్యాడీ స్టార్ హీరో.
2019లో సంక్రాంతికి 'ఎంత మంచివాడవురా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీని తర్వాత అతడు మరో సినిమాను ప్రకటించలేదు. కానీ, వేణు మిల్లిడి అనే దర్శకుడితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి 'రావణ్', 'తుగ్లక్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్తో సాగే సరికొత్త కథతో తెరకెక్కనుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Photos: లావుగా ఉండే సెలబ్రెటీలు..ఇప్పుడు ఎంత నాజూగ్గా మారిపోయారో
ఇదిలా ఉండగా, కల్యాణ్ రామ్ చేయబోయే మరో సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అతడు రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో ప్రయోగత్మక చిత్రాన్ని చేయబోతున్నాడట. ఇందులో ఈ నందమూరి హీరో ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడని అంటున్నారు. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడనుందని ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో ఈ ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు ట్రిపుల్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే.