Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
యంగ్ హీరోతో మహేశ్ బాబు సినిమా: త్వరలోనే అధికారిక ప్రకటన
కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. హీరోగా ఫుల్ ఫామ్లో ఉన్న అతడు.. పలు వ్యాపారాలనూ ప్రారంభించాడు. ఇప్పటికే ఏఎంబీ పేరిట హైదరాబాద్లో థియేటర్ ఓపెన్ చేసిన ఈ స్టార్ హీరో... జీ మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ను కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఇందులో 'మేజర్' అనే సినిమాను ప్రకటించాడు. అడవి శేష్ హీరోగా ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు.
'మేజర్' పట్టాలపై ఉండగానే... 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' అనే సినిమాతో టాలీవుడ్ మొత్తానికి చర్చనీయాంశంగా మారిపోయిన నవీన్ పోలిశెట్టితో మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడట సూపర్ స్టార్ మహేశ్ బాబు. తన సొంత నిర్మాణ సంస్థ జీ మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న వ్యాపారవేత్తలను ఇందులో టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది.