Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రభాస్ సినిమా తాత్కాలికంగా ఆగిపోయిందా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదల కానుంది. ఈ లోపు మరో చిత్రాన్ని ప్రారంభించాలని ప్రభాస్ ఆ మధ్యన భావించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకతంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం ఉంటుందని వార్తలు వచ్చాయి.
రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే ఈ చిత్రాన్ని ఆగష్టులో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్రం తాత్కాలికంగా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాహో షూటింగ్ బిజీగా సాగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టంట్ లతో ప్రభాస్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడే మరో చిత్రం వద్దని భావించాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
ఈ చిత్రానికి పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చిన తెలిసిందే. ఇదిలా ఉండగా సాహో చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్. సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు.