Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. భీష్మ మళ్ళీ వస్తున్నాడు!
యువ హీరో నితిన్ చాలా కాలం తరువాత మంచి సక్సెస్ అందుకున్నాడు. అఆ సినిమా తరువాత వరుసగా హ్యాట్రిక్స్ డిజాస్టర్స్ అందుకున్న నితిన్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా భీష్మ సినిమాతో సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. లాక్ డౌన్ లేకుండా ఉంటే మరికొన్ని రోజులు సందడి చేసి ఉండేది.
ఇంకా చాలా మంది భీష్మ సినిమాను చూడకపోవడంతో ప్రతిరోజు నితిన్ ని ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు. సినిమా డిజిటల్ OTT వరల్డ్ లోకి ఎప్పుడు వస్తుంది అని ట్వీట్స్ చేయడంతో నితిన్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ నెల 25 నుంచి భీష్మ సినిమా నెట్ ఫ్లిక్స్, సన్ NXTలో సందడి చేయనున్నట్లు నితిన్ వివరణ ఇచ్చాడు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ లో సమయం చూసి విడుదల చేసిన నితిన్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా మరొక హిట్ అందుకునేలా ఉన్నాడనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఈ హీరో రంగ్ దే సినిమాతో రానున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అలాగే చంద్రశేఖర్ యేలేటి, కృష్ణ చైతన్య వంటి టాలెంటెడ్ దర్శకులతో పాటు మెర్లపాక గాంధీ డైరెక్షన్ లో కూడా నితిన్ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు.