Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారీ డిజాస్టర్ తర్వాత ఆ దర్శకుడికి నితిన్ ఛాన్స్: ఈ సారి పక్కా హిట్ కొట్టేందుకు ప్లాన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ప్లాపులు చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతున్నాడు కాబట్టి ఎన్నో పరాజయాలను చవి చూశాడు. ఇక, ఈ మధ్య కాలంలోనూ అలాగే మూవీలు చేసుకుంటూ వెళ్తోన్నా.. వైవిధ్యమైన కథలతో వస్తున్నాడు. అందుకే ఇటీవలి కాలంలోనే ఎక్కువ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క సినిమాను చేసి భారీ డిజాస్టర్ను మూటగట్టుకున్న వక్కంతం వంశీతో నితిన్ సినిమా చేయబోతున్నాడని ఓ న్యూస్ బయటకొచ్చింది.
సినీ రచయితగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో భాగమైన వక్కంతం వంశీ.. కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్తో 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. దీంతో అప్పటి నుంచి మరో సినిమాను ప్రకటించలేదు వంశీ. ఇలాంటి పరిస్థితుల్లో యూత్ స్టార్ నితిన్ అతడికి దర్శకుడిగా మరో అవకాశం ఇవ్వబోతున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వీళ్ల మధ్య కథా పరమైన చర్చలు సఫలం అయ్యాయని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇది ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. వీళ్లిద్దరికి పక్కాగా హిట్ కావాలి కాబట్టి.. సరికొత్త ప్లాన్తో రాబోతున్నారట.
ఇదిలా ఉండగా.. గత ఏడాది 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్నాడు నితిన్. అయితే, ఈ సంవత్సరం మాత్రం వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి తీసిన 'చెక్'.. వెంకీ అట్లూరి రూపొందించిన 'రంగ్ దే' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. పరాజయం పాలయ్యాయి. వీటి తర్వాత ఇప్పుడు 'మాస్ట్రో' అనే సినిమాలో నటిస్తున్నాడతను. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లు. నితిన్ సొంత బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది.