Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెండు సినిమాలపై గురిపెట్టిన నితిన్.. దర్శకులు వీరే!
యంగ్ హీరో నితిన్ కొత్త ఏడాది జోరు పెంచబోతున్నాడు. రెండు చిత్రాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. గత ఏడాది నితిన్ కు అంతగా కలసి రాలేదు. గత ఏడాది విడుదలైన ఛల్ మోహన్ రంగ,, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో రొమాంటిక్ టచ్ ఉండే ఎంటర్ టైనింగ్ చిత్రాలపై నితిన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల త్వరలో నితిన్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అదే సమయంలో సూర్య ప్రతాప్ అనే డెబ్యూ దర్శకుడితో కూడా నితిన్ ఓ రొమాంటిక్ కామెడీ చిత్రానికి కమిట్ అయ్యాడట. ఈ రెండు చిత్రాల షూటింగ్ తో నితిన్ బిజీ కాబోతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఎక్కుగా ఫన్ ఉండేలా చూడాలని నితిన్ తన దర్శకులకు సూచించినట్లు తెలుస్తోంది.
వెంకీ దర్శత్వంలో తెరకెక్కబోయే చిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక సూర్య ప్రతాప్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలకు సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.