Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెండు సినిమాలపై గురిపెట్టిన నితిన్.. దర్శకులు వీరే!
యంగ్ హీరో నితిన్ కొత్త ఏడాది జోరు పెంచబోతున్నాడు. రెండు చిత్రాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. గత ఏడాది నితిన్ కు అంతగా కలసి రాలేదు. గత ఏడాది విడుదలైన ఛల్ మోహన్ రంగ,, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో రొమాంటిక్ టచ్ ఉండే ఎంటర్ టైనింగ్ చిత్రాలపై నితిన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల త్వరలో నితిన్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అదే సమయంలో సూర్య ప్రతాప్ అనే డెబ్యూ దర్శకుడితో కూడా నితిన్ ఓ రొమాంటిక్ కామెడీ చిత్రానికి కమిట్ అయ్యాడట. ఈ రెండు చిత్రాల షూటింగ్ తో నితిన్ బిజీ కాబోతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఎక్కుగా ఫన్ ఉండేలా చూడాలని నితిన్ తన దర్శకులకు సూచించినట్లు తెలుస్తోంది.
వెంకీ దర్శత్వంలో తెరకెక్కబోయే చిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక సూర్య ప్రతాప్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలకు సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.