Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
దుబాయ్లో దుమ్ములేపుతున్నాడు.. రెండు పనులను కానిస్తున్న నితిన్!!
మామూలుగా కరోనా లాక్డౌన్ వంటివి రాకపోతే రెండు మూడు నెలలకు నితిన్ సినిమాలు వరుసబెట్టి వచ్చేవి. మొత్తంగా ఈ ఏడాదిలో నితిన్ నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. రంగ్ దే, చెక్, అంధాదున్ వంటి చిత్రాలన్నీ ఈ పాటికే వచ్చి ఉండేవి. అయితే కరోనా వల్ల అంతా మారిపోయింది. ఇప్పుడిప్పుడు నితిన్ స్పీడ్ పెంచుతున్నాడు. అందులో ముఖ్యంగా నితిన్ రంగ్ దే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. మొదటగా ఈ మూవీ పూర్తయ్యాకే.. చెక్, అంధాదున్ చిత్రాలను రెడీ చేస్తాడని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమా కోసం దుబాయ్ చెక్కేశాడు. దుబాయ్కు తన శ్రీమతి షాలినీని తీసుకుని మరీ జంటగా వెళ్లాడు నితిన్. పెళ్లయ్యాక ఎలాగూ హనీమూన్కు ఈ కొత్త జంట వెళ్లలేదు. అందుకే ఇలా సినిమా షూటింగ్ వంకతోనైనా హనీమూన్కు వెళ్లినట్టుందని భావించాడే. మొత్తానికి దుబాయ్లో ఈ జంట వాలింది. ఓ పర్సనల్ పనులు.. మరో వైపు ప్రొఫెషనల్ పనులు కానిచ్చేస్తున్నాడు నితిన్.
నితిన్ రంగ్ దే చిత్రం పూర్తవ్వడంతో చంద్రశేఖర్ యేలేటి కాంబోలో రాబోతోన్న చెక్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమాలో రకుల్, ప్రియ ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఇక అంధాదున్ రీమేక్లో తమన్నా, నభా నటేష్లు నటిస్తున్నారు. మొత్తానికి నితిన్ చేతినిండా ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు. ఏలాడూ ఈ ఏడాది ప్రారంభంలోనే భీష్మతో మంచి హిట్ కొట్టి ఉన్నాడు.