Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో యాక్షన్ ఎంటర్టైనర్లో నితిన్: కెరీర్లోనే తొలిసారి అలాంటి పాత్రలో యూత్ స్టార్
గత ఏడాది లాక్డౌన్కు ముందు 'భీష్మ' అనే భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. ఇక, ఈ ఏడాది మాత్రం ఇప్పటికే రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగా.. అవి దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్. ఇందులో భాగంగానే జయాపజయాలను బేరీజు వేసుకోకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు 'మాస్ట్రో' అనే మూవీలో చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును లైన్లో పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న నితిన్.. 'నా పేరు సూర్య' వంటి ఫ్లాప్తో డైరెక్టర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. ఈ కాంబోలో నిజంగానే ఓ మూవీ రాబోతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని చర్చలూ పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఉన్న కారణంగా ఈ సినిమా ప్రకటన చేయలేదని అంటున్నారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ ప్రాజెక్టుకు కొబ్బరి కాయ కొట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నితిన్ పోలీస్ ఆఫసర్గా నటిస్తున్నాడట. గతంలో యాక్షన్ సినిమాల్లో నటించినా.. అతడు ఈ తరహా పాత్రను మాత్రం పోషించలేదు. అందుకే ఇందులో అదిరిపోయే రోల్ను క్రియేట్ చేశాడట వక్కంతం వంశీ. ఇక, కథ కూడా ఎమోషనల్గా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నితిన్ 'మాస్ట్రో' అనే సినిమాలో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లు. నితిన్ సొంత బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది.