మేమే గర్వంగా ప్రకటిస్తాం.. చిరంజీవి సినిమా గురించి తప్పుడు వార్తలొద్దు!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రానికి నిర్మాత. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇదిలా ఉండగా చిరంజీవి నటించబోయే తదుపరి చిత్రం గురించి చాలా రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చిరు నెక్ట్స్ మూవీ కొరటాల దర్శత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వైజయంతి సంస్థ స్పందించింది. మెగాస్టార్ తదుపరి చిత్రం వైజయంతి బ్యానర్ లో అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

మెగాస్టార్ చిరంజీవి, వైజయంతి మూవీస్ కాంబినేషన్లో 4 ఆల్ టైం హిట్ మూవీస్ వచ్చాయి. ఒక వేళ ఐదవ చిత్రం చేస్తే ఆ విషయాన్ని తామే సగర్వంగా ప్రకటిస్తామని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదుల చేసింది.


Click it and Unblock the Notifications











