విలయం తరువాత ఎన్టీఆర్, ఏఎన్నార్ విరాళం!
నందమూరి బాలకృష్ణ అటు ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్, ఇటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై అభిమానుల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలయ్యే నటిస్తుండడంతో ఆసక్తి నెలకొని ఉంది.
ఈ చిత్ర షూటింగ్ ని ప్లాన్ ప్రకారం పూర్తి చేసే పనిలో దర్శకుడు క్రిష్ నిమగ్నమయ్యాడు. కీలకమైన సన్నివేశాల కోసం ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ కృష్ణ జిల్లా చేరుకుంది. దాదాపు వారం రోజులపాటు కృష్ణ జిల్లా దివిసీమలో షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు 40 ఏళ్ల క్రితం అంటే 1977లో కృష్ణా జిల్లాని అతలాకుతలం చేసిన దివిసీమ తుఫాన్ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు. దివిసీమ తుఫాన్ భీభత్సం తరువాత ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పట్లో విరాళాలు సేకరించారు. ఆ సన్నివేశాల్ని బాలయ్య, ఏఎన్నార్ గా నటిస్తున్న సుమంత్ పై చిత్రీకరించనున్నారు.


Click it and Unblock the Notifications











