twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళనాడు అసెంబ్లీలో చర్చలకు దారితీసిన పవన్ కళ్యాణ్ కామెంట్స్..

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఆయన విజయాన్ని అందుకోకపోయినప్పటికి ఆయన ప్రభావం మాత్రం ప్రస్తుత రాజకోయల్లో మాత్రం ఎంతో కొంత చూపిస్తూనే ఉంది. ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక ఇటీవల తమిళనాడు ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ కూడా తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కూడా చర్చించే వరకు వెళ్లింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ పై ఆ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు.

    పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలపై వివరణ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ రోజు కూడా తన సినిమాలకు సంబంధించిన విషయాలపై కూడా పవన్ స్పంధించలేదు. కేవలం ప్రజా సమస్యలపై పాలకుల పరిపాలనలపై మాత్రమే స్పందించే ప్రయత్నం చేస్తుంటాడు.
    ఇక ఇటీవల తమిళ అధికార ప్రభుత్వ పని తీరుపై ఒక వివరణ ఇచ్చారు. జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ ప్రశంసాత్మక ట్వీట్ తమిళనాడు CM MK స్టాలిన్ దక్షిణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చించబడుతోంది

     Pawan Kalyan appreciation Tweet Discussed In Tamilnadu Assembly

    అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా రాజకీయాలు చేయాలి, కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయకూడదు " ఇది పవన్ కళ్యాణ్ ట్వీట్ యొక్క సారాంశం. MK స్టాలిన్ తన శైలి మరియు పారదర్శక పాలన కోసం ప్రశంసించారు. స్టాలిన్ ఎఐఎడిఎంకె నాయకుల (జయలలిత పార్టీ) చిత్రాలు ఉన్న ₹ 13 కోట్ల విలువైన స్కూల్ బ్యాగ్‌లను విసిరేయకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రశంసలు అందించారు. అనేక ప్రభుత్వాలు గత ప్రభుత్వ భవనాల రంగులను మార్చడం అలాగే వారి అధిపతుల చిత్రాలను ముద్రించడం వంటివి చేస్తున్నప్పటికీ, స్టాలిన్ తన డిఎంకె ప్రభుత్వం ఆ మునుపటి బ్యాగ్‌లను మాత్రమే పంపిణీ చేస్తుందని, అయితే విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు మరియు ఇతర సహాయక అంశాల కోసం బడ్జెట్‌ను కేటాయిస్తుందని పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో, డిఎంకెకి చెందిన ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చదివి, మెగాస్టార్ చిరంజీవి మరియు జనసేన అధ్యక్షుడు ఇద్దరూ ఎంకె స్టాలిన్ పనిని చూసి ప్రశంసలు కురిపించారని అన్నారు. అలాగే తమ పార్టీ ఇప్పుడు మరింత కష్టపడుతుందని అందరికీ హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ప్రభుత్వాలు తమ పనితురును గౌరవిస్తున్నాయని చెనుతూ.. పవన్ ట్వీట్ చదివేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో చప్పట్లు కొట్టారు.

    ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. నెక్స్ట్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఇక యువ దర్శకుడు సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే హరహర వీరమళ్లు సినిమాను కూడా పూర్తి చేసి ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాని వీలైనంత త్వరగా ఫినిష్ పనిచేయాలని పవన్ ప్రణాళికలు రచిస్తున్నారు. అనంతరం వచ్చే ఏడాది చివర్లో సురేందర్రెడ్డి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Pawan Kalyan appreciation Tweet Discussed In Tamilnadu Assembly,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X