Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు: లేటుగా ప్రకటించినా అదే ముందు
రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడాయన. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్గా రూపొందుతోందీ మూవీ. ఇది షూటింగ్ పూర్తవక ముందే మరికొన్ని చిత్రాలను లైన్లో పెట్టేశాడు పవన్. వీటిలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రంతో పాటు హరీశ్ శంకర్ ప్రాజెక్టు కూడా ఉంది. అలాగే మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ కూడా చేస్తున్నారు.
'వకీల్ సాబ్' తర్వాత పవన్ కల్యాణ్.. క్రిష్తోనే సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లైన్లోకి వచ్చింది. సాగర్ కే చంద్ర తెరకెక్కించనున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ఇప్పటికే రవితేజ, గోపీచంద్, నితిన్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో దగ్గబాటి రానానే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నాడు.
ప్రస్తుతం 'వకీల్ సాబ్' మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. హైదరాబాద్లో జరుగుతోన్న షెడ్యూల్లో ఆయన పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ను డిసెంబర్ 21 అనగా సోమవారం అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. జనవరి మొదటి వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో పవన్ కల్యాణ్కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతుందని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.