Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒకే రోజు రెండు సినిమాలు.. రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్న పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నెవర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి అనంతరం దాదాపు చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ సినిమాలపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ముందుగా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Recommended Video
పింక్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఇక పవన్ మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల షూటింగ్స్ ను పవన్ ఒకే రోజు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 27వ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ అవుట్ స్కట్స్ లో ఒక స్పెషల్ సెట్ వేయగా అందులో దర్శకుడు క్రిష్ కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఇక మరోవైపు హైదరాబాద్ లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా అందులో కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. ఉదయం క్రిష్ సినిమా మధ్యాహ్నం తరువాత AK రీమేక్ కోసం వెళుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రెగ్యులర్ పాలిటిక్స్ ను కూడా ఏ మాత్రం మరచిపోవడం లేదు. ఎప్పటికప్పుడు పార్టీ గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు.