Just In
- 35 min ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 10 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
- 11 hrs ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
Don't Miss!
- News
కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ ఫ్యాన్స్కు శుభవార్త: అందులోకి ఎంటర్ అవబోతున్న పవర్ స్టార్.. ముహూర్తం ఫిక్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలందరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి కారణం ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే. మరే ఇతర హీరోకు లేని విధంగా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పవన్ సినిమా ఫ్లాప్ అయినా కలెక్షన్లు మాత్రం విపరీతంగా వస్తుంటాయి. వీళ్ల కోసమే రాజకీయాల్లోకి వెళ్లిపోయినా.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు, తన అభిమానులకు మరింత చేరువ అవ్వాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరవబోతున్నాడట. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్లో అకౌంట్లు ఓపెన్ చేసిన ఆయన.. దీనికి మాత్రం దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా తన ఫ్యాన్స్ కోసం ఇన్స్టాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది. దీన్ని కేవలం సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసమే వాడాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్లో మాత్రం సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన పోస్టులను కూడా పెడుతోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పవన్ కల్యాణ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ 'పింక్'కు రీమేక్గా వస్తున్న దీనిని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రంలో పవన్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ రెండు చిత్రాలను ఒకేసారి పూర్తి చేసి.. ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమాను పట్టాలెక్కించాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నాడు.