Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నిర్ణయం మార్చుకున్న పవన్ కల్యాణ్: దాన్ని పక్కన పెట్టి.. దీన్ని లైన్లో పెట్టాడు
చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ్యభిచార గృహంలో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్గా ఇందులో నటిస్తున్నాడాయన. వాస్తవానికి 2020లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా ప్రభావంతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఇటీవలే చిత్రీకరణను పున: ప్రారంభించి రెండు రోజుల క్రితం పూర్తి చేశారు.
'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ అవడంతో పవర్ స్టార్ దీని తర్వాత ఏ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆయన గతంలోనే క్రిష్ జాగర్లమూడితో సినిమా ప్రకటించారు. కానీ, ఇటీవల మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లైన్లోకి వచ్చింది. దీంతో ఈ సినిమానే ముందుగా పూర్తవుతుందని పవన్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. అయితే, తన సినిమాల విషయంలో పవర్ స్టార్ నిర్ణయం మార్చుకున్నారట. ఇందులో భాగంగానే క్రిష్ మూవీని ముందుగా మొదలెడతారని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. క్రిష్ సినిమా కోసం జనవరి 4 నుంచి డేట్స్ కేటాయించాడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దాదాపు నెల రోజుల పాటు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పిరియాడిక్ జోనర్లో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. మొదటి షెడ్యూల్లోనే పవన్తో పాటు ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.