Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
మరికొన్ని నెలలైతే తట్టుకోలేమని.. ముందే ధైర్యం చేస్తున్న ప్రభాస్!
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం కాస్త వేగంగా వెంటవెంటనే రెండు సినిమాలను రిలీజ్ చేయాలని అనుకున్నాడు. ఇక సాహో అనంతరం కొన్నాళ్ళు పాన్ ఇండియా కథలను కూడా దూరం పెట్టాలని అనుకున్నాడు. అసలు వంద కోట్ల సినిమా అంటేనే ఇప్పట్లో నా వల్ల కాదని చెప్పిన డార్లింగ్ తెలియకుండానే వెంటవెంటనే అంతకుమించిన బడ్జెట్ సినిమాలకు కామిట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది.
మళ్ళీ ఇలాంటి కథలు అవకాశాలు వస్తాయో రావో.. అని అనుకున్నాడో ఏమో గాని మొత్తానికి 500కోట్ల బడ్జెట్ వరకు వచ్చేశాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిగ్గెస్ట్ పాన్ ఇండియా కథలను సెట్ చేసుకున్నడు. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే అంతా బాగానే ఉండేది. వెంటవెంటనే సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ లాక్ డౌన్ వలన ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుంది.
ప్రభాస్ సిద్ధంగా ఉన్నా కూడా మిగతా ఆర్టిస్టులు దొరక్కపోవచ్చు. అందుకే ఒక డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడం వలన మళ్ళీ షూటింగ్స్ కు అనుమతి దొరికే అవకాశం ఉంది. దీంతో వెంటనే రాధేశ్యామ్ పనులన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఆ తరువాత ఒకేసారి సలార్ పనులను కూడా త్వరగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఆదిపురుష్ పూర్తి చేస్తూనే నాగ్ అశ్విన్ సినిమాను కూడా స్టార్ట్ చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు