Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్వరలో బాలీవుడ్ సినిమా చేయబోతున్న ప్రభాస్, దర్శకుడు ఎవరంటే?
ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార విషయంలో గతేడాది రకరకాల వార్తలు వినిపించాయి. ప్రభాస్ హీరోగా కరణ్ జోహార్ బాలీవుడ్ సినిమా చేయాలనుకున్నాడని, అయితే ఈ ఆఫర్ ప్రభాస్ రిజెక్ట్ చేశాడని, తాను సినిమా చేయాలంటే రూ. 30 కోట్ల రెమ్యూనరేషస్ ఇవ్వాలని యంగ్ రెబల్ స్టార్ డిమాండ్ చేశారని, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది.
అయితే తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ రూమర్లకు చెక్ పెట్టారు. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన తాజా చిత్రం 'సాహో' ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న ప్రభాస్ కరణ్ జోహార్ దర్శకత్వంలో సినిమా చేయాలనే తన కోరికను బయట పెట్టారు. త్వరలోనే ఆయన సినిమా ద్వారానే బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
కరణ్ జోహార్తో తనకు ఉన్న లాంగ్ అసోసియేషన్ గురించి ప్రభాస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరి మధ్య మంచి రాపో ఉందని, ఆయన సహకారం వల్లనే బాహుబలి నార్త్ ఇండియాలో అతిపెద్ద విజయం సాధించింది అని యంగ్ రెబల్ స్టార్ చెప్పుకొచ్చారు.
'బాహుబలికి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది కరణ్ జోహార్. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. కరణ్ జీ మద్దతు ఉండటం వల్లనే బాహుబలి ఉత్తరాధిలో అంతపెద్ద విజయం సాధించింది. బాహుబలి టీమ్ మొత్తం ఆయన పట్ల ఎంతో గౌరవంతో ఉంటుంది. కరణ్ జోహార్ అపుడు మా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడనే విషయం సౌత్ ఇండియాలో కూడా చర్చనీయాంశం అయింది.' అని ప్రభాస్ తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సాహో చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగులో సైమల్టేనియస్గా షూట్ చేశాం, దీన్ని ప్యాన్ ఇండియా సినిమాగా తేవాలనే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించామని తెలిపారు. తనకు బాలీవుడ్ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.
హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్గా 'సాహో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మంది బేడీ, చుంకీ