Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కండలు కరిగిస్తున్న ప్రభాస్.. ఆ స్టార్ డైరెక్టర్ కోసం మరోసారి బాహుబలిలా...
సాహో మూవీ తర్వాత రాధేశ్యామ్ను పట్టాలెక్కించిన యంగ్ రెబల్ స్టార్ వరుస సినిమాలతో 2021 సంవత్సరాన్ని హడలెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాధేశ్యామ్ను వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకొంటూనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే సలార్ అనే చిత్రం కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతున్నారు. గత 10 నెలలుగా ఇంటికే పరిమితమైన ప్రభాస్ రాబోయే సినిమా కోసం పటిష్టంగా తయారయ్యేందుకు రెడీ అయినట్టు సమాచారం. ఆ వివారాల్లోకి వెళితే....
ప్రశాంత్ నీల్ కోసం ప్రభాస్
రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నటించే సినిమాపై అనేక సందేహాలు, ఊహాగానాలు మీడియాలో షికారు చేశాయి. అయితే కేజీఎఫ్తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ కోసం సలార్ సినిమాకు ఒకే చెప్పడం అభిమానుల్లో సంతోషాలు పొంగిపొర్లాయి.
భారీ యాక్షన్ మూవీ కోసం
బాహుబలి తర్వాత అంతటి భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న సలార్ మూవీ కోసం ప్రభాస్ ప్రిపేర్ అవుతున్నారు. సలార్ కోసం సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తన పాత్ర గురించి కొనసాగుతున్న ఊహాగానాలకు తెర దించడానికి మూవీ యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.
సలార్ కోసం ఫుల్ ఫిట్గా
ప్రశాంత్ నీల్ రూపొందించే సలార్ సినిమాలో ప్రభాస్ మళ్లీ మాస్ హీరోగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రభాస్ తన ఫిట్నెస్ను, సిక్స్ప్యాక్ మాదిరిగా ఉండే దేహాదారుఢ్యం కోసం జిమ్లో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. క్రమం తప్పకుండా వెయిట్ తగ్గించేందుకు కండలు కరిగిస్తున్నట్టు సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
కేజీఎఫ్ 2 తర్వాత సలార్ కోసం
తాజా సమాచారం ప్రకారం.. సలార్ మూవీ జనవరి 2021లో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు కేజీఎఫ్2 సినిమాను పూర్తి చేసుకొని సలార్ను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్టు సమాచారం. సలార్ కోసం ప్రభాస్ను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఆది పురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో
ఇక రాధేశ్యామ్, సలార్ సినిమాల తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించే ఆది పురుష్ చిత్రంలో నటిస్తారు. ఆది పురుష్ తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించే చిత్రం కోసం రెడీ అవుతారు. ఇలా దాదాపు 2022 వరకు ప్రభాస్ ఖాళీ లేకుండా ఫిక్స్ అయిపోవడం తెలిసిందే.