Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ చెంత చేరునున్న ప్రభాస్.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
నేటితరం యువ హీరో హీరోయిన్లు సరికొత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. కేవలం సినిమాలే గాక విభిన్నంగా వ్యాపార కోణంలో ఆలోచిస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు సినిమా నిర్మాణంలో భాగమవుతుండగా ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ ప్రారంభించి బిజినెస్మెన్గా సెన్సేషన్ అయ్యారు. మహేష్ ఇన్స్పిరేషన్ తో పలువురు యంగ్ స్టార్ ఇదే బాట పడుతుండటం విశేషం.
ఈ కోవలోనే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారనే వార్త బాగా వైరల్ అవుతోంది. తన దగ్గరి స్నేహితులతో కలిసి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు సంబందించిన అన్నిపనులు చకచకా పూర్తిచేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ రంగంలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు సక్సెస్ కావడంతో తమ అభిమానం హీరో కూడా సక్సెస్ కావడం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు. కొద్ది రోజుల్లేనే ప్రభాస్ వ్యాపార విషయమై అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రానుందని తెలుస్తోంది.
ప్రభాస్, అనుష్క మధ్య ఇరుక్కుని ఇబ్బంది పడ్డ తమన్నా, అసలు ఏరిగిందంటే..?
ఇటీవలే బాహుబలి విజయంతో వరల్డ్ స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో బాహుబలిని మరిపించేలా ఈ సినిమా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ 15వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలోనూ ప్రభాస్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.