Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘సాహో’ కౌంట్ డౌన్... హే డార్లింగ్స్ అంటూ కిర్రాక్ ఫోటో షేర్ చేసిన ప్రభాస్!
ప్రభాస్ అభిమానులు ఎంత ఆకలిగా ఉన్నారంటే... వారు తమ అభిమాన హీరో నుంచి విందు భోజనం లాంటి సినిమా చూసి రెండేళ్లు దాటిపోయింది. 'బాహుబలి 2' తర్వాత యంగ్ రెబల్ స్టార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆగస్టు 15న 'సాహో' విడుదలకు సిద్దమవుతోంది.
జూన్ 13న ఉదయం 11.23 గంటలకు టీజర్ విడుదలతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. టీజర్ రిలీజ్ డేట్ గుర్తు చేస్తూ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కిర్రాక్ ఫోటో షేర్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్ మధ్యలో నుంచి ప్రభాస్ స్పోర్ట్స్ బైక్పై దూసుకొస్తున్న ఈ పవర్ ఫుల్ పిక్ అభిమానులకు కనువిందు చేస్తోంది.
'హే డార్లింగ్స్... మరొక్క రోజు మాత్రమే. 'సాహో' ప్రపంచంలో రైడ్ చేయడానికి సిద్దంగా ఉన్నారా? రేపు ఉదయం 11.23 గంటలకు టీజర్ విడుదల కాబోతోంది అంటూ ఇన్స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ షేర్ చేశారు. దీనికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
'సాహో' మూవీ విషయానికిస్తే.... సుజీత్ దర్శకత్వం వహిస్తుండా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్టట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఇది ఉండబోతోంది.
'సాహో' బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.