Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నెంబర్ వన్ హీరో అని మరోసారి నిరూపించుకున్న ప్రభాస్.. న్యూ రికార్డ్
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. బాహుబలి అనంతరం టాలీవుడ్ నుంచి ఒక హీరో ఈ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడు అని ఎవరు కూడా ఊహించలేదు. సాహో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా కూడా బాలీవుడ్ జనాల్లో ప్రభాస్ క్రేజ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. అయితే ఆ సినిమా తరువాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లో కూడా ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య మరింతగా పెరిగింది.
ప్రభాస్ కి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈ స్టార్ హీరో పెద్దగా యూజ్ చేయడు. చాలా రేర్ కి పోస్ట్ లు పెట్టినప్పట్టికి ఫాలోవర్స్ ఇంకా పెరువుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ లో ఈ స్టార్ హీరో సౌత్ లో నెంబర్ వన్ అనిపించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ వారికి లేని ఫేస్ బుక్ ఫాలోవర్స్ ప్రభాస్ కి చేరువయ్యారు. దాదాపు 20మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉండడంతో ప్రస్తుతం ఆ వార్త మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలతో ఆ సంఖ్య డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ ఆదిపురుష్ అనే రామాయణ కథతో మొదటిసారి బాలీవుడ్ లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమాతో రెబల్ స్టార్ మార్కెట్ కూడా ఊహించని స్థాయికి చేరుకోవడం కాయమని అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టనున్నాడు ప్రభాస్.