Don't Miss!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- News కేసీఆర్ కుటుంబం, మాజీమంత్రి ఎర్రబెల్లిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!!
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
నెంబర్ వన్ హీరో అని మరోసారి నిరూపించుకున్న ప్రభాస్.. న్యూ రికార్డ్
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. బాహుబలి అనంతరం టాలీవుడ్ నుంచి ఒక హీరో ఈ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడు అని ఎవరు కూడా ఊహించలేదు. సాహో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా కూడా బాలీవుడ్ జనాల్లో ప్రభాస్ క్రేజ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. అయితే ఆ సినిమా తరువాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లో కూడా ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య మరింతగా పెరిగింది.
ప్రభాస్ కి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈ స్టార్ హీరో పెద్దగా యూజ్ చేయడు. చాలా రేర్ కి పోస్ట్ లు పెట్టినప్పట్టికి ఫాలోవర్స్ ఇంకా పెరువుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ లో ఈ స్టార్ హీరో సౌత్ లో నెంబర్ వన్ అనిపించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ వారికి లేని ఫేస్ బుక్ ఫాలోవర్స్ ప్రభాస్ కి చేరువయ్యారు. దాదాపు 20మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉండడంతో ప్రస్తుతం ఆ వార్త మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలతో ఆ సంఖ్య డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ ఆదిపురుష్ అనే రామాయణ కథతో మొదటిసారి బాలీవుడ్ లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమాతో రెబల్ స్టార్ మార్కెట్ కూడా ఊహించని స్థాయికి చేరుకోవడం కాయమని అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టనున్నాడు ప్రభాస్.