Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Radhe shyam: ఎలాగోలా హిట్ చేసేయండి డార్లింగ్స్.. ప్రభాస్ ఈ మాట ఎందుకు అన్నాడంటే..?
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే రాధేశ్యామ్ సినిమాపైనే ఉంది. బాహుబలి, సాహో వంటి బిగ్ బడ్జెట్ బడ్జెట్ సినిమాలతో అనంతరం మూడవసారి మరో అతి పెద్ద పాన్ ఇండియా సినిమాను ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. అయితే సినిమా బాగానే వచ్చింది అని అంటున్నప్పటికి చిత్ర యూనిట్ సభ్యులలో మాత్రం విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ పెరుగుతోందట. ఇక ప్రభాస్ ఇటీవల ప్రెస్ మీట్ లో అభిమానులను చాలా వినయంగా ఈ సినిమాను కూడా ఎలాగైనా హిట్ చేసేయండి అని కోరడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రభాస్ ఎందుకు ఆ మాట అన్నాడు అనే వివరాల్లోకి వెళితే..
ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో..?
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా హిందీలో తప్పితే మరెక్కడా కూడా డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు పెద్దగా లాభాలను అందించలేకపోయింది. ఇక ఈ సారి రాధేశ్యామ్ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుంది అనేది ప్రస్తుతం అభిమానులనే కాకుండా ప్రభాస్ మనసులో కూడా ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేసి నట్లు అర్థమవుతోంది.
ప్రభాస్ మీద దైర్యంతో
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆయనతో సినిమాలు చేసేవారు పాన్ ఇండియా రేంజ్ తగ్గట్టుగానే ప్రతీ సినిమాను రూపొందిస్తున్నారు. మొదట ఏదో 100 కోట్లతో ఫినిష్ చేయాలి అని అనుకున్న రాధే శ్యాన్ ప్రాజెక్టును కూడా అంతకు మించి అనేలా భారీ బడ్జెట్ తో రూపొందించాల్సి వచ్చింది. ప్రభాస్ కు ఉన్న డిమాండ్ ను బట్టి సినిమాలకు ఎంత ఖర్చు చేసినా పర్వాలేదు అని నిర్మాతలు ఒక ధైర్యం తో అయితే ముందడుగు వేస్తున్నారు.
రూ.100కోట్ల నుంచి రూ.300కోట్లకు..
అసలైతే రాధేశ్యాన్ సినిమా కథ అనుకున్నప్పుడు ఒక వంద కోట్ల లో పూర్తి చేసేందుకు ప్రభాస్ ఒప్పుకున్నాడట. కానీ యు.వి.క్రియేషన్స్ అలా కాకుండా ప్రభాస్ రేంజ్ పెరిగింది కాబట్టి మళ్లీ ఆ బడ్జెట్ ను 150 కోట్లకు నుంచి మరింత పెంచినట్లు గా ప్రభాస్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మొత్తం ఈ సినిమా కోసం 300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా కూడా ప్రభాస్ వివరణ ఇవ్వడం విశేషం.
సెకన్లలో ఉండే సన్నివేశాల కోసం..
అయితే ఈ సినిమా మొదట వందకోట్ల లోపే పూర్తి చేయాలని అనుకున్నప్పుడు పర్వాలేదు అనుకున్నట్లు చెప్పిన ప్రభాస్ ఆ తర్వాత బడ్జెట్ పెంచుతుంటే కాస్త టెన్షన్ పెరిగిపోయింది అని కూడా అన్నాడు. కొన్ని సెకండ్లలో ఉండే సీన్ కోసమే యు.వి.క్రియేషన్స్ భారీగా ఖర్చు చేసింది అని ఈ కథకు ఏమాత్రం తక్కువ కాకుండా చాలా గ్రాండ్ గా చూపించాలని వాళ్ళు చాలా మొండిగా ఫిక్స్ అయ్యారు అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
ఎలాగోలో హిట్ చేసేయ్యండి..
బడ్జెట్ పెరిగిన కొద్దీ తన లో కాస్త భయం టెన్షన్ కూడా పెరిగింది అని చెప్పిన ప్రభాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ సినిమాను ఎలాగోలా చూసేయండి డార్లింగ్స్ అని అభిమానులను రిక్వెస్ట్ చేయడం విశేషం. తన కెరీర్లో ఇదివరకు వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి ప్రేమ కథలకు మంచి విజయాన్ని అందుకున్నాయి అని వాటిని చూశారు కదా ఇది కూడా ఎలాగోలా హిట్ చేసేయండి డార్లింగ్స్ అంటూ ప్రభాస్ రిక్వెస్ట్ చేస్తూ ఉండడం వెనుక కొంత టెన్షన్ పడుతున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.