Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ‘సాహో’.. దక్షిణాదిలోనే ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.
ట్రైలర్తో రెట్టింపు
కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్కు భారీ స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు, ఇటీవల వచ్చిన ట్రైలర్తో అవి రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.
ప్రమోషన్ షురూ
త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించబోతున్నారు.
సాహో ఘనత
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్తో పాటు ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. ‘సాహో' సినిమాను ప్రపంచంలోనే పెద్దదైన గ్రాండ్ రెక్స్లో ప్రదర్శించనున్నారు. ఇది పారిస్లో ఉంది. ఈ థియేటర్లో ఒకేసారి 2800 మంది కూర్చుని సినిమా చూసే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ తమ సినిమా ప్రదర్శితమవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
ప్రభాస్ రికార్డు
ఇక్కడ ప్రభాస్ సినిమా విడుదల అవడం కొత్తేమీ కాదు. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'ని కూడా ఇక్క ప్రదర్శించారు. అయితే, మరే తెలుగు హీరో సినిమా ఇక్కడ ప్రదర్శితం కాలేదు. అలాగే, దక్షిణాది నుంచి ఇప్పటి వరకు ‘కబాలి', ‘మెర్సల్', ‘విశ్వరూపం 2' మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి. అంటే.. ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.