Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరో సినిమాపై చర్చలు జరుపుతున్న ప్రభాస్.. ముంబైలో సిట్టింగ్.. 500కోట్ల ప్రాజెక్ట్?
రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా కంటే కూడా ప్రభాస్ మిగతా సినిమాల గాసిప్స్ వల్లనే ఎక్కువగా వైరల్ అవుతున్నాడు. రాధేశ్యామ్ అప్డేట్స్ ఆలస్యంగా ఉన్నప్పటికీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలు మాత్రం అభిమానులకు మంచి కిక్కిస్తున్నాయి. ఇక ఇటీవల ఈ స్టార్ హీరో మరో బాలీవుడ్ అగ్ర దర్శకుడితో చర్చలు జరిపినట్లు సమాచారం.
రాధేశ్యామ్ ఆలస్యం అయినప్పటికీ
సాహో అనంతరం స్పీడ్ పెంచాలని అనుకున్న ప్రభాస్ కు మళ్ళీ అనుకోని విధంగా బ్రేకులు పడుతున్నాయి. రాధేశ్యామ్ సినిమా కోసం ఆడియెన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ కారణంగా ఆలస్యం అయినప్పటికీ చిత్ర యూనిట్ కనీసం సరైన అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఆ కోపం అభిమానుల్లో రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది.
హాలీవుడ్ లో కూడా
ఇక రాధేశ్యామ్ అప్డేట్ వచ్చినా రాకపోయినా కూడా ప్రభాస్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై మాత్రం వెంటవెంటనే క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. 21వ సినిమాగా సలార్ రూపొందుతుండగా 22వ ప్రాజెక్ట్ గా ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా 23వ ప్రాజెక్ట్ గా విడుదల కానుంది. ఆ సినిమాను హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు.
వార్ దర్శకుడితో
ఇక ఆదిపురుష్ సినిమాతో ఇప్పటికే పూర్తిగా బాలీవుడ్ టెక్నీషియన్లతో వర్క్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు మరొక నార్త్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. వార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని నెలలుగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video
500కోట్ల ప్రాజెక్ట్?
ఇక ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్ అక్కడ స్పెషల్ గా సిద్దార్థ్ ఆనంద్ ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ 24వ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోయే ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వస్తోంది. దాదాపు 500కోట్లయినా ఖర్చ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారట. మరి ఈ గాసిప్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.