Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాథేశ్యామ్ నిర్మాతతో మరో సినిమాకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్
టీ-సిరీస్ తో చేతులు కలిపి మరో పాన్ ఇండియా మూవీ రాథేశ్యామ్ కు శ్రీకారం చుట్టిన ప్రభాస్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు పెంచేశాడు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంటే ఇక బాలీవుడ్ లో డార్లింగ్ స్టార్ హీరోల సరసన చేరిపోయినట్లే. అయితే, అప్పటివరకూ ఆగే ఆలోచన వారికి లేనట్లుంది. అందుకే ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా మీద నమ్మకంతో మరో మూవీకి కూడా సంతకాలు పెట్టించేసుకున్నారు.
రాథే శ్యామ్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, ప్రభాస్ తో ఓ భారీ చారిత్రక పురాణేతిహాసాన్ని తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో అత్యంత భారీ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ లైన్ వినగానే, డార్లింగ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడట. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట.
సాహో, రాథేశ్యామ్ తరువాత భూషణ్, ప్రభాస్ కలయికలో వస్తున్న మూడో చిత్రంగా అప్పుడే ట్రేడ్ వర్గాల్లో కావాల్సినంత హడావిడి జరిగిపోతోంది. ఇక ఇప్పటికే రాథేశ్యామ్ చిత్రానికి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తవ్వగా, మరో రెండు నెలల షూటింగ్ బాకీ ఉందని తెలుస్తోంది. పరిస్థితులు అనకూలిస్తే, త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలన్నది చిత్ర బృంంద ఆలోచన.
రాథేశ్యామ్ చిత్రీకరణ పూర్తవుతూనే నాగ్ అశ్విన్ దర్శత్వంలోని చిత్రానికీ, టీ-సిరీస్ తో పురాణేతిహాసాని ఒకేసారి డేట్లు కేటాయించనున్నాడట మన డార్లింగ్. మరి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైనప్ చేసేస్తున్న ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్ లో కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.