twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాథేశ్యామ్ నిర్మాతతో మరో సినిమాకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్

    |

    టీ-సిరీస్ తో చేతులు కలిపి మరో పాన్ ఇండియా మూవీ రాథేశ్యామ్ కు శ్రీకారం చుట్టిన ప్రభాస్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు పెంచేశాడు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంటే ఇక బాలీవుడ్ లో డార్లింగ్ స్టార్ హీరోల సరసన చేరిపోయినట్లే. అయితే, అప్పటివరకూ ఆగే ఆలోచన వారికి లేనట్లుంది. అందుకే ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా మీద నమ్మకంతో మరో మూవీకి కూడా సంతకాలు పెట్టించేసుకున్నారు.

    రాథే శ్యామ్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, ప్రభాస్ తో ఓ భారీ చారిత్రక పురాణేతిహాసాన్ని తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో అత్యంత భారీ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ లైన్ వినగానే, డార్లింగ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడట. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట.

    Prabhas to star in Mythological drama

    సాహో, రాథేశ్యామ్ తరువాత భూషణ్, ప్రభాస్ కలయికలో వస్తున్న మూడో చిత్రంగా అప్పుడే ట్రేడ్ వర్గాల్లో కావాల్సినంత హడావిడి జరిగిపోతోంది. ఇక ఇప్పటికే రాథేశ్యామ్ చిత్రానికి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తవ్వగా, మరో రెండు నెలల షూటింగ్ బాకీ ఉందని తెలుస్తోంది. పరిస్థితులు అనకూలిస్తే, త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలన్నది చిత్ర బృంంద ఆలోచన.

    రాథేశ్యామ్ చిత్రీకరణ పూర్తవుతూనే నాగ్ అశ్విన్ దర్శత్వంలోని చిత్రానికీ, టీ-సిరీస్ తో పురాణేతిహాసాని ఒకేసారి డేట్లు కేటాయించనున్నాడట మన డార్లింగ్. మరి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైనప్ చేసేస్తున్న ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్ లో కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.

    English summary
    Prabhas to reunite with Bhushan Kumar after RadheShyam, for an larger than life Mythological drama. It is said the period saga to be made on a lavish budget.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X