Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాథేశ్యామ్ నిర్మాతతో మరో సినిమాకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్
టీ-సిరీస్ తో చేతులు కలిపి మరో పాన్ ఇండియా మూవీ రాథేశ్యామ్ కు శ్రీకారం చుట్టిన ప్రభాస్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు పెంచేశాడు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంటే ఇక బాలీవుడ్ లో డార్లింగ్ స్టార్ హీరోల సరసన చేరిపోయినట్లే. అయితే, అప్పటివరకూ ఆగే ఆలోచన వారికి లేనట్లుంది. అందుకే ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా మీద నమ్మకంతో మరో మూవీకి కూడా సంతకాలు పెట్టించేసుకున్నారు.
రాథే శ్యామ్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, ప్రభాస్ తో ఓ భారీ చారిత్రక పురాణేతిహాసాన్ని తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో అత్యంత భారీ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ లైన్ వినగానే, డార్లింగ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడట. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట.
సాహో, రాథేశ్యామ్ తరువాత భూషణ్, ప్రభాస్ కలయికలో వస్తున్న మూడో చిత్రంగా అప్పుడే ట్రేడ్ వర్గాల్లో కావాల్సినంత హడావిడి జరిగిపోతోంది. ఇక ఇప్పటికే రాథేశ్యామ్ చిత్రానికి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తవ్వగా, మరో రెండు నెలల షూటింగ్ బాకీ ఉందని తెలుస్తోంది. పరిస్థితులు అనకూలిస్తే, త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలన్నది చిత్ర బృంంద ఆలోచన.
రాథేశ్యామ్ చిత్రీకరణ పూర్తవుతూనే నాగ్ అశ్విన్ దర్శత్వంలోని చిత్రానికీ, టీ-సిరీస్ తో పురాణేతిహాసాని ఒకేసారి డేట్లు కేటాయించనున్నాడట మన డార్లింగ్. మరి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైనప్ చేసేస్తున్న ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్ లో కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.