Don't Miss!
- News మాజీ సీఎం రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అభిమానుల ఎక్స్పెక్టేషన్స్తో ఆడుకోను, అలాంటి కథలే చేస్తా: ప్రభాస్
బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియాలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరిగా అవతరించారు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఆయన సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగిన విధంగానే 'సాహో' లాంటి భారీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు.
సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన 'సాహో' ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ...'ప్యాన్ ఇండియా వైడ్ అభిమానులు ఇష్టపడే కథల కోసమే ఎదురు చూస్తున్నానని, ప్రస్తుతం సాహో మూవీ అలాంటిదే, ఇకపై కూడా తన ఎంపిక అలాగే ఉంటుంది.' అన్నారు.
తన సినిమా వస్తుందంటే అభిమానుల్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వారికి కావాల్సింది అందించే ప్రయత్నం చేస్తాను. అంతే కానీ వారి ఎక్స్పెక్టేషన్స్తో ఆడుకునే ప్రయత్నం మాత్రం చేయను అని ఈ సందర్భంగా ప్రభాస్ స్పష్టం చేశారు.
సాహోలో ప్రభాస్, శ్రద్ధా కపూర్తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ తదితరులు నటిస్తున్నారు. సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపొందించారు కాబట్టి అన్ని భాషల నుంచి నటీ నటులను ఇందులో భాగం చేశారు.